ఐదేళ్ల చిన్నారి గొంతు కోసి చంపిన యువకులు (వీడియో)

64பார்த்தது
యూపీలోని ముజఫర్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విశాల్‌ అనే ఐదేళ్ల చిన్నారిని బ్లేడుతో గొంతు కోసి హత్య చేశారు. విశాల్ తన తల్లితో కలిసి బహదర్‌పూర్‌లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అయితే ఆడుకునేందుకు బయటకు వెళ్లిన విశాల్‌ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు గాలించగా సమీపంలోని చెరుకు తోటలో విశాల్ మృతదేహం లభ్యమైంది. కుమారుడి మృతదేహం చూసి అతడి తల్లి రోదన మిన్నంటింది. ఈ హత్య కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.