தென்காசி - Tenkasi

పెద్దపల్లి జిల్లా
సింగరేణి కార్మికుల కష్టాలు కళ్ళారా చూశా : కొప్పుల ఈశ్వర్
May 12, 2024, 05:05 IST/రామగుండం
రామగుండం

సింగరేణి కార్మికుల కష్టాలు కళ్ళారా చూశా : కొప్పుల ఈశ్వర్

May 12, 2024, 05:05 IST
సింగరేణిలో 26 ఏళ్లపాటు కార్మికుడిగా పనిచేసి, వారి కష్టాలు కళ్లారా చూసిన తనను ఎంపీగా గెలిపిస్తే వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక నాయ కుడిగా, ఉద్యమ నేతగా అనేక పోరాటాలు చేసి జైలుకు కూడా వెళ్లివచ్చానని ఆయన అన్నారు. కారుణ్య నియామకాల ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కార్మికులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కారుగు ర్తుకు ఓటు వేసి తననను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, నాయకులు మిర్యాల రాజిరెడ్డి, మాదాసు రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.