పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఏవో

76பார்த்தது
పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఏవో
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామంలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఏఓ డేగల వెంకట్రామయ్య పాల్గొని మాట్లాడుతూ.. ఇటీవల వర్షాలకు నీటమునిగిన పంట పొలాలను రక్షించుకునేందుకు నీరు బయటకు పంపాలని సూచించారు. వరి పైరు పెరుగుదలకు కావలసిన మందులు పిచికారి చేసి రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది సూచనలు సలహాలు రైతులు తప్పక పాటించాలని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி