ఘర్షణ పై సమగ్ర విచారణ చేపట్టాలి

78பார்த்தது
ఘర్షణ పై సమగ్ర విచారణ చేపట్టాలి
నరసరావుపేట పట్టణం జీవనజ్యోతి బార్లో ఇటీవల జరిగిన ఘర్షణపై పోలీసులు ఏకపక్ష వైఖరి అవలంబిస్తున్నారని పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ ఆరోపించారు.ఈ నేపథ్యంలో గురువారం నరసరావుపేట సెంటర్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రెండు రోజుల క్రితం బార్ లో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి బిల్లు చెల్లించే విషయంలో ఘర్షణ జరిగి, ఇరువర్గాలు రెండవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనపై ఇరువర్గాల వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిన పట్టణ సీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி