60 ఏళ్ల తర్వాత బుడమేరు ఉగ్రరూపం!

57பார்த்தது
60 ఏళ్ల తర్వాత బుడమేరు ఉగ్రరూపం!
బుడమేరుకు గతంలో కూడా వరద వచ్చింది. దీనికి సంబంధించిన ఆంధ్రప్రతిక 1964లో ప్రచురించిన ఓ కథనం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సెప్టెంబర్ 29న బుడమేరు ఒక్కసారిగా ఉప్పొంగింది. అజిత్‌సింగ్ నగర్, సత్యనారాయణపురం ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. అనధికారిక లెక్కల ప్రకారం 10 మంది గల్లంతయ్యారు. దీంతో బుడమేరుపై రిజర్వాయర్ కట్టాలని అప్పట్లోనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఆనాడు రైతులకు విరాళం ఇచ్చేందుకు మొగ్గు చూపారని ఈ కథనం పేర్కొంది.

தொடர்புடைய செய்தி