నేడు జోగిపేటలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

జోగిపేట పట్టణ పరిధిలోని అన్నాసాగర్ విద్యుత్ ఉపకేంద్రంలో ఫీడర్ మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. అన్నాసాగర్ తో పాటు పోసానిపేట, కిచ్చన్న పల్లి, మన్ సాన్ పల్లి, రోళ్లపాడు, నేరేడు గుంట గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు.