భారత్ సరిహద్దులో యుద్ధ విమానాలను చైనా మోహరించింది. సిక్కిం సమీపంలో అధునాతన స్టెల్త్ ఫైటర్స్ను ఉంచింది. మే 27న సేకరించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం బయపడింది. సిక్కింకు 150 కి.మీ. దూరంలో సైనిక, ప్రజల అవసరాల కోసం వినియోగించే ఎయిర్పోర్ట్ను చైనా నిర్మించింది. ఈ ఎయిర్పోర్ట్లో ఆరు అధునాతన జే-20 ఫైటర్ జెట్లతోపాటు ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ కేజే-500 కూడా ఇక్కడ ఉన్నట్లు సమాచారం.