ఏపీలో వైసీపీకి 2-4, కూటమికి 19-21 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసిన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే కీలక విషయాలు తెలిపింది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ప్రస్తుత ఎన్నికలపై గట్టి ప్రభావం చూపిందని, దీని వల్ల కూటమికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది. అలాగే కూటమిలోని పార్టీలు ఇగోలకు పోకుండా సీట్ల సర్దుబాటు చేసుకోవడం వాటికి కలిసి వచ్చినట్లు వివరించింది. 2019 నాటి ఫలితాలు తిరగబడ్డాయంది.