పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం ఆజంనగర్ అటవీ గ్రామంలోని నాయకపు పోడు గిరిజన తెగకు చెందిన తోట చంద్రమౌళి దంపతుల ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతో వండిన భోజనాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే నేలపై కూర్చుని భోజనం చేశారు. సన్నబియ్యం పంపిణీ తో పేదవారి కళ్ళలో ఆనందాన్ని స్వయంగా చూశానన్నారు.