ప్రధాని మోడీ నియోజకవర్గంలో విషాదం.. గోపురం కూలి వ్యక్తి మృతి (వీడియో)

72பார்த்தது
ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసిలో గురువారం విషాద ఘటన జరిగింది. వర్షం పడడంతో మేవాలాల్ (57) అనే వ్యక్తి బారాదరి గోపురం కింద కూర్చున్నాడు. భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఆ గోపురం కుప్పకూలింది. దీంతో మేవాలాల్ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఓ కుక్క కూడా ప్రాణాలు కోల్పోయింది. అయితే అప్పటి వరకు అక్కడ ఉన్న కొందరు ఈ ప్రమాదం జరగడానికి ముందే వెళ్లిపోయారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది.

தொடர்புடைய செய்தி