కరీంనగర్ నగరపాలక సంస్థలో ఆస్తి పన్ను పై ఎర్లీబర్డ్ స్కీం అందిస్తున్న అయిదు శాతం రాయితీ గడువు మంగళవారంతో ముగియనుందని నగర పాలక డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ కౌంటర్ల వద్ద ఆస్తి పన్ను తీసుకుంటామని, ఆన్ లైన్ లో 12 గంటలలోపు చెల్లించవచ్చన్నారు.