ఏపీ, తెలంగాణకు శుభవార్త

559பார்த்தது
ఏపీ, తెలంగాణకు శుభవార్త
పాఠశాలలు, కళాశాలలకు సెలవులివ్వడంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళుతున్నారు. దీంతో రైళ్లల్లో రద్దీ నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. మే 27 నుంచి జూన్‌ 24 వరకు సంబల్‌పూర్‌-కాచిగూడ రైలు నడుస్తుంది. అలాగే ఇదే రైలు తిరుగు ప్రయాణంలో మే 28 నుంచి జూన్ 25 వరకు నడుస్తుంది.