మాజీ ఎంపీ ర‌మేశ్ రాథోడ్ క‌న్నుమూత

2970பார்த்தது
మాజీ ఎంపీ ర‌మేశ్ రాథోడ్ క‌న్నుమూత
ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్ ఇక‌లేరు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు త‌ర‌లిస్తుండ‌గా.. మార్గ మ‌ధ్య‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు.