మత సామరస్యం చాటుకున్న ముస్లిం దంపతులు

సూర్యాపేట జిల్లా యాతవాకిళ్ళలో ముస్లిం దంపతులు షేక్ దస్తగిరి- సైదాబీ మత సామరస్యం చాటుకున్నారు. శ్రీ చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలోని శ్రీ గణేష్ మహారాజ్ లడ్డుని రూ. 29 వేలకు గురువారం కైవసం చేసుకున్నారు. భారీ ఊరేగింపుతో లడ్డుని దస్తగిరి ఇంటికి తరలించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చత్రపతి శివాజీ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.