పౌష్టికాహారంతోనే తల్లి, బిడ్డ క్షేమం

పౌష్టికాహారంతోనే తల్లి బిడ్డ క్షేమమని సిడిపిఓ సుబ్బలక్ష్మి, 20వ వార్డు కౌన్సిలర్ అన్నెపర్తి రాజేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం 20వ వార్డు జమ్మిగడ్డలో పౌష్టికాహార వారోత్సవాలో పాల్గొని మాట్లాడారు. పౌష్టికాహారం తోనే తల్లి బిడ్డ క్షేమమని, గర్భిణీ స్త్రీలు పండ్లు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు ఎక్కువగా తీసుకోవాలని దానివలన రక్తహీనత లేకుండా సుఖ ప్రసవం జరుగుతుందని అన్నారు.