బాలికల పాఠశాలలో 10 లక్షలతో సౌకర్యాలు

కోహీర్ లోని బాలికల ఉన్నత పాఠశాలలో 10 లక్షల రూపాయలతో సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని ఎంఈఓ శంకర్ అన్నారు. ఓ పరిశ్రమ సహకారంతో కోహీర్ బాలికల పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి పరిశ్రమ ముందుకు రావడం మంచి పరిణామం అని చెప్పారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి జాకీర్ హుస్సేన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆశాలత పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி