రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడిఈ వేణుగోపాల్, ఏఈ సంధ్యారాణి తెలిపారు. సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఎల్ఐసి కాలనీ, ఎన్టీఆర్ నగర్, రెడ్డి కాలనీ, కాలేజీ రోడ్డు, మార్కెట్ ఏరియా, తదితర కాలనీలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.