రైల్వే స్టేషన్ లో మోగిన ఎమర్జెన్సీ అలారం.. ఉలిక్కిపడిన ప్రజలు

బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఎమర్జెన్సీ అలారం మోగడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అధిక శబ్దం అలారం మోగడంతో ఏం జరిగిందని కంగారు పడ్డారు. స్టేషన్ పరిసర ప్రాంత ప్రజలు ఏకంగా రైల్వే స్టేషన్ కు వెళ్లి ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. కాగా ఎమర్జెన్సీ అలారం పరీక్షించడంలో భాగంగా మోగినట్టు స్టేషన్ సిబ్బంది తెలిపారు.