నులి పురుగుల నిర్మూలనకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు. ఈనెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 1810 పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లలో ఒక సంవత్సరం పిల్లలు మొదలుకొని 19 సంవత్సరాల లోపు ఉన్న 1, 81, 807 పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండ జోల్ మాత్రలు ఇవ్వాలన్నారు.