హనుమాన్ శోభాయాత్ర విజయవంతానికి హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు ధన్యవాదములు తెలిపారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని పాత హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శివ గౌడ్ మాట్లాడారు. శోభాయాత్రకు సహకరించిన జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పోలీసు అధికారులకు, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులకు, ఎస్పీఎం, ప్రింట్, మీడియా ప్రతినిథులకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు పాల్గొన్నారు.