బుగ్గారం మండలంలోని బీర్సాని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు.
ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పై లబ్ధిదారుల ఎంపిక చేసి ప్రకటించారు. ఈ గ్రామ సభలో ఎంపీడీఓ అఫ్జల్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాపు రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు హాజరయ్యారు.