100 కుటుంబాలు వైసీపీలో చేరిక
ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామానికి చెందిన 100 కుటుంబాలు టిడిపిని వీడి శుక్రవారం వైసీపీలో చేరాయి. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో 100 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి కృష్ణమోహన్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. నాగార్జున రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని పార్టీలో చేరిన కార్యకర్తలు అన్నారు.