మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పరిధి షిండేకి చావానీ ప్రాంతంలో తాజాగా అమానుష ఘటన జరిగింది. సరళా బాత్రా అనే 70 ఏళ్ల మహిళ తన కుమారుడు విశాల్ బాత్రా, అతని భార్య నీలికతో కలిసి నివసిస్తోంది. కాగా నీలిక అత్తపై దాడి చేసింది. దారుణంగా కొట్టి, నేలపై పడేసింది. కనికరం లేకుండా అత్తను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లింది. అడ్డొచ్చిన భర్తను బంధువులతో కొట్టించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.