వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలో మంచి స్థాయికి వెళ్లనున్నట్లు సమాచారం. రాజ్యసభ పదవీ కాలం ఇంకా మూడున్నరేళ్లు ఉండగానే.. ఎంపీ పదవితో పాటు వైసీపీకి కూడా వీఎస్ఆర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని, ఆయన చెబుతున్నా.. ఇటీవలే ఉప రాష్ట్రపతిని కలవడం చర్చనీయాంశంగా మారింది. విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి రాబోతుందని, ఆయనకు బీజేపీ నాయకుల సపోర్ట్ బలంగా ఉందని కొందరు చెబుతున్నారు.