గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు, గంజాయిని కొనుగోలు, సేవించిన మైనర్ బాలుడితో సహ, ఆరుగురుని హన్మకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి 180గ్రాముల గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్, 2 వీలర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నిందితులు భూపాలపల్లి జిల్లాకు చెందిన మణికంఠ, రోహిత్ లు సులభంగా డబ్బు సంపాదించలని, ఒడిషా రాష్ట్రంలో ఆర కిలో గంజాయి కొనుగోలు చేసారు.