భార్య టార్చర్ భరించలేక.. రైలు కింద పడి భర్త సూసైడ్!

ఒడిశాలోని ఖోర్ధా జిల్లాలో భార్య వేధింపులు తాళలేక భర్త రైలు కింద దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. బాధితుడు రామచంద్ర బర్జెనాకు రెండేళ్ల కింద రూపాలి అనే యువతితో వివాహం జరిగింది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. పెళ్ళైనప్పటి నుంచి భార్య మానసికంగా వేధిస్తోందంటూ ఓ వీడియో రికార్డ్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. రామచంద్ర తల్లి ఫిర్యాదుతో భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி