విద్యుత్తు తీగలు తగిలి ముగ్గురి మృతి

ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో శనివారం విద్యుత్తు తీగలు తగిలి ముగ్గురు మృతి చెందారు. కోరుకొండ మండలం కాపవరంలో రైస్ మిల్లులోకి ధాన్యం బస్తాల లోడు తీసుకువెళ్తుండగా విద్యుత్తు తీగలు తగిలి షాక్ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி