జగిత్యాల జిల్లాలో చోరీలకు పాల్పడ్డ అంతర్ జిల్లా దొంగను జగిత్యాల పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అతని నుంచి 25 లక్షల విలువ వేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మంచిర్యాల జిల్లాకు చెందిన బక్కశెట్టి కొమురయ్య ఇప్పటివరకు 25 పైగా దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.