రాజారాంపల్లిలో కంచెలే లేని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు

ఎండపల్లి మండలం రాజారాంపల్లి విద్యుత్ విభాగం పరిధిలోని అనేక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె లేని కారణంగా పెను ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం జరిగే పరిస్థితులు నెలకొన్నా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఒక మేక ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ కు గురి కాగా తక్షణమే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.

தொடர்புடைய செய்தி