ఢిల్లీలో జరిగిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ నాయకుడు సజ్జన్ కుమార్కు మరణశిక్ష విధించాలని సిక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ అల్లర్లలో తండ్రి, కొడుకు హత్యలకు పాల్పడినందుకు గతంలో దోషిగా తేలిన సజ్జన్కు తాజాగా కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఆయనకు విధించిన జీవిత ఖైదుని మరణశిక్షగా మార్చాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. విషాదకరమైన సంఘటన జరిగి 40ఏళ్లకు పైగా గడిచిందని పేర్కొన్నారు.