ధన్యవాదాలు అధ్యక్షా!: ఎమ్మెల్యే శంకర్

ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ గా నియమించినందుకు గాను గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలసి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహించి ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.