నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం తెలిపారు. కాగా, ఇప్పటికే NDRF, SDRF బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.