శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్, సిపి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, సీపీ కల్మేశ్వర్ సోమవారం పరిశీలించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీరు తదితర విషయాలపై ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 1091 అడుగులకు గాను 1088 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు 80 టీఎంసీలకు గాను 72. 6 పిఎంసిల నీరు ఉన్నట్లు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని, వరద ఇన్ఫ్లో ను బట్టి అవుట్ ఫ్లో చేయాలని అధికారులను సూచించారు.