శోభ యాత్రను పర్యవేక్షించిన ఎస్పీ

ముధోల్ మండల కేంద్రంలో ఏడవ రోజు జరుగుతున్న వినాయక శోభ యాత్రను శుక్రవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ పర్యవేక్షించారు. నిమజ్జనోత్సవాన్ని శాంతి యుతంగా జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. సమయానికి గణేశ్ లను నిమజ్జనం చేయాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఐ మల్లేష్, ఎస్ఐ సాయికిరణ్ పాల్గొన్నారు.