2వ రోజు బ్రహ్మచారిణీ అవతారంలో అమ్మవారు

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం 2వ రోజు అమ్మవారు బ్రహ్మచారిణీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఆలయ వైదిక బృందం విశేష కుంకుమ పూజలను నిర్వహించి పులిహోర నైవేద్యంగా నివేదించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈఓ విజయరామరావు తెలిపారు.

தொடர்புடைய செய்தி