ముథోల్: వ్యవసాయ శాఖ మంత్రి కలిసిన ఎమ్మెల్యే

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు సోమవారం ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సోయా కొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి ఆరు క్వింటాళ్లు మాత్రమే సోయా పంటను కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల సోయ కోనుగోలు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

தொடர்புடைய செய்தி