నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు: ఏఎస్పీ

భైంసా పట్టణంలో ఆదివారం జరగబోయే గణేష్ శోభాయాత్రలో పరిమితికి మించి సౌండ్ బాక్స్ లు పెట్టి అధిక శబ్ద కాలుష్యం చేయరాదని భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధిక శబ్ద వలన చిన్న పిల్లలకు, వృద్ధులకు గుండె సంబంధిత రోగులకు ప్రాణహాని ఉంటుందని కావున పోలీసులు ఇచ్చిన పరిమితి మరియు సూచనలు పాటించి ఊరేగింపులో పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉన్నంగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.