డిజిటల్ కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

డిజిటల్ కుటుంబ సర్వేను ప‌క‌డ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణం 42వ వార్డు(చింతకుంట వాడ)లో శుక్రవారం కొనసాగుతున్న ఇంటింటిసర్వేను ఆమె పరిశీలించారు. ముందుగా ఇంటింటి సర్వేను ఎన్ని బృందాలతో చేపడుతున్నారని, సర్వే నమోదులో ఏమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సర్వే బృంద సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி