తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో అరుంధ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మేకలకు మేత వేద్దామని కూతురును, కుమారుడిని పొలం వద్దకు తీసుకెళ్లిన అరుంధ.. ముందు కూతురుని బావిలో పడేయాలనుకుంది. అయితే కూతురు ప్రజ్వల 'అమ్మా.. నన్ను బావిలో పడేయకు' అని తల్లిని వేడుకోగా.. ఆమె తనను ఇంటికి పంపించింది. తర్వాత కొడుకును బావిలో పడేసి, తాను ఆత్మహత్య చేసుకుంది. శేఖర్ అనే వ్యక్తి తన తల్లికి కాల్ చేసి ఏడిపించాడని.. దీంతో మనస్థాపానికి గురై బావిలో దూకేసిందని ప్రజ్వల చెప్పింది.