ఎట్టకేలకు సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల

కూసుమంచి మండలం మల్లాయిగూడెం వద్ద సాగర్ ఎడమ కాల్వకు పడిన గండ్లు పూడ్చి వేత పనులు ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున పూర్తయ్యాయి. సుమారు నాలుగు గంటల 30 నిమిషాలకు రింగ్ బండ్ తొలగించి అధికారులు దిగువకు సాగర్ జలాలు విడుదల చేశారు. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పనులు పూర్తి కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.