పాలేరు ఎడమ కాలువను పరిశీలించిన కలెక్టర్

కూసుమంచి మండలం పాలేరు ఎడమ కాలువకు ఏర్పడ్డ గండిని అధికారులు మరమ్మతులు పూర్తి చేసి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాలేరు ఎడమ కాలువ గండి వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం అధికారులకు జిల్లా కలెక్టర్ పలు ముఖ్య సూచనలు చేశారు. నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.