సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్‌ దాడి.. 22 మంది మృతి

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజాగా లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందారు. ‘లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 22 మంది మృతిచెందగా.. 117 మంది గాయపడ్డారు’ అని లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

தொடர்புடைய செய்தி