హైదరాబాద్ రాష్ట్రంలో బీర్ల ధరలు 15 శాతం పెరగనున్నాయి. విశ్రాంత జడ్జి జస్టిస్ జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ సిఫార్సు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సవరణతో ప్రస్తుతం ఉన్న ఎంఆర్పి పై 15 శాతం పెరుగుతుంది. కొత్త ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి.