పండక్కి సొంతూళ్లకు.. భారీగా ట్రాఫిక్ జామ్ (వీడియో)

దసరా పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కువ శాతం మంది సొంత వాహనాలలో బయల్దేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

தொடர்புடைய செய்தி