అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 4సంక్షేమ పథకాలపై నిర్వహిస్తున్న గ్రామ సభల్లో భాగంగా గురువారం వనపర్తి జిల్లాలో పాల్గొన్నారు. జూపల్లి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజమైన లబ్దిదారులకే అందాలని, ఇంకా ఎవరైనా మిగిలిపోయిన, పేర్లు జాబితాలో లేకున్నా నమోదు చేసుకొనేందుకు గ్రామసభలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.