జడ్చర్ల: బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. పట్టణంలోని బీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన బిహార్ కు చెందిన రాషద్ ఖాన్ రూం కిరాయికి తీసుకుని ఉంటున్నాడు. కాగా బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. సమాచారం అందుకున్న సీఐ కమలాకర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி