మళ్లీ వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి?

AP: మాజీ సీఎం జగన్‌కు వైసీపీ నేతలు భారీ షాకులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల ముందు జగన్‌ని వీడిన నేత, తిరిగి మళ్ళీ వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ నేత మరెవరో కాదు.. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. గత ఎన్నికల ముందు ఆయన వైసీపీని వీడి బీజేపీలో చేరారు. అయితే ఆయనకు బీజీపీలో బలం లేకపోవడంతో బీజేపీకి రాజీనామా చేసి త్వరలో YCPలో చేరనున్నట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி