AP: మాజీ సీఎం జగన్ ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం అసెంబ్లీకి హాజరుకానున్నారు. ఈ సమావేశాలకు హాజరై కూటమి సర్కార్ హామీలపై సూపర్ 6కి కేటాయించిన నిధులు, అమలు తీరుపై ప్రశ్నించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది జగన్ వ్యూహమన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది.