పాకిస్తాన్‌లో ప్రయాణికుల వాహనం పై కాల్పులు..11 మంది మృతి!

పాకిస్తాన్‌ వాయువ్య ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లో హింస ఆగడం లేదు. గుర్తు తెలియని దుండగులు ప్రయాణికుల వాహనంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయాపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న కుర్రం జిల్లాలోని కంజ్ అలిజాయి ప్రాంతంలో ముష్కరులు ప్రయాణికుల వాహనంపై మెరుపుదాడి చేశారని కుర్రం డిప్యూటీ కమిషనర్ చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி