ఫలక్నామా రౌడీషీటర్ మాస్యుద్దీన్ను దుండగులు చంపేశారు. డబీర్ పురా ఫ్లై ఓవర్ వద్ద వెళ్తుండగా అడ్డగించి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల క్రితమే మాస్ యుద్దీన్కు వివాహం జరగగా సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. పాతగొడవల నేపథ్యంలో ప్రత్యర్థులే హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.